
ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా నిర్మించిన త్రీ గోర్జెస్ డ్యామ్తో భూమికి ముప్పు ఏర్పడనుందా?.. ఈ డ్యామ్ కారణంగా భూగమనంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయా?.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ డ్యామ్ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్ డ్యామ్ను చైనా నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ డ్యామ్ అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే కట్టడాల్లో ఒకటి.